Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అంతమొందించాలని కొంతమంది రెక్కీ నిర్వహిస్తున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. కావాలని కుట్రపూరితంగా పవన్ నీ టార్గెట్ చేసినట్లు ఆయన ఇల్లు మరియు ఆఫీసు చుట్టూ రెక్కీ నిర్వహించి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో చేస్తున్నట్లు జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అంతేకాకుండా పోలీస్ లకి ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా విశాఖ గర్జన తర్వాత జనవాణి నిర్వహించాలని తలచి… పవన్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే. ఆ టైములో చోటు చేసుకున్న పరిణామాలు వలన పవన్ తన కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెనక్కి తిరిగి వచ్చేయడం జరిగింది.
ఆ తర్వాత మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో మరింత భద్రత పెంచటానికి స్వయంగా రామ్ చరణ్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రస్తుత సెక్యూరిటీ మొత్తం మార్చేసి కొత్త ప్లానింగ్ తో రెడీ అయినట్లు టాక్. ఇందుకోసం రోజు మొత్తానికి 75 మంది సెక్యూరిటీ సిబ్బందిని సెలెక్ట్ చేసినట్లు ఒక్కో షిఫ్ట్ కి 25 మంది చొప్పున మూడు షిఫ్ట్ లుగా ప్లాన్ చేసినట్లు వీళ్లు ఇంటిదగ్గర మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో కూడా డ్యూటీ చేసే తరహాలో… కట్టుదిట్టంగా ఆయన చుట్టూ వలయంగా రాంచరణ్ ఏర్పరచినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చరణ్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోపక్క పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎటువంటి రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ భద్రతా విషయంలో పార్టీ నేతలతో పాటు కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.