Bellamkonda Suresh: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్లపై చీటింగ్ కేసు నమోదు అయింది. రూ. 85 లక్షలు టోకరా వేశారంటూ వీఎస్ శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఆరోపించడంతో.. బంజరాహిల్స్ లోని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వీరిద్దరూ 2018-19 మధ్య కాలంలో తన దగ్గర నుంచి రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. అది కూడా తన అకౌంట్ నుంచి చాలా మంది టెక్నీషియన్స్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రవణ్ కుమార్. అలాగే తనని సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తానని కూడా చెప్పినట్లు శ్రవణ్ తెలిపారు.
ఆ తరువాత సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాలేదట. దాంతో ఇచ్చిన మొత్తం డబ్బును తిరిగి రిటర్న్ చేయాలని అడగ్గా బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ ఇద్దరూ సరిగా స్పందించడం లేదని.. పైగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రవణ్ కోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడంతో.. బంజరాహిల్స్ లోని పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు శ్రీనివాస్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి దీనిపై బెల్లంకొండ శ్రీనివాస్, సురేష్లు ఎలా స్పందిస్తారో చూడాలి.