సిమ్రాన్.. ఈ ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో మారుమోగిన పేరు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది సిమ్రాన్. 2009లో వివాహం చేసుకొని.. ఆ తర్వాత సినిమాలకి దూరమైంది. 2014లో ఆహా కళ్యాణం చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా బాలీవుడ్ థ్రిల్లర్ చిత్రం ‘అంధాధున్’ తమిళ రీమేక్ లో సిమ్రాన్ నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించనున్నారు. టబు పోషించిన పాత్రను కోలీవుడ్ లో సిమ్రాన్ చేయనున్నారు. ఈ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి జె. జె. ఫ్రెడరిక్ దర్శకతం వహిస్తున్నారు.
మొదట మోడలింగ్ చేసిన సిమ్రాన్ అబ్బాయి గారి పెళ్ళాం సినిమాతో 1997 తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. దశాబ్డం పాటు విరామం లేకుండా నిరవధికంగా సినిమాలు చేసింది. మంచి ఫామ్ లో ఉండగానే పెళ్ళి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
రి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో చాలా తక్కువ మంది మళ్ళీ హీరోయిన్ గా నటించటం సాధ్యమయింది. చాలామంది అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటిస్తున్నారు. కానీ సిమ్రాన్ కి ఈ రెండు అవకాశాలు దక్కలేదు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రల్లో ఆమె నటిస్తున్నారు. ఈ మధ్య పార్థిబన్ దర్శకత్వం వహించిన కోడిట్ట ఇడంగళ్ సినిమాలో కేవలం రెండు మూడు సీన్ లలో మాత్రమే కనిపించింది.
ఏ మాత్రం నటనకు ఆస్కారం లేని పాత్రల్లో సిమ్రాన్ నటిస్తున్నారు. అలాగే హీరో విశాల్ నటించిన తుప్పరివాలన్ సినిమాలో కూడా రెండు మూడు సన్నివేశాల్లో నటించింది. సిమ్రాన్ నటించిన సినిమా పావ కధైగాల్ ఈ నెల 18న విడుదలవుతుంది. ఈ చితమైన సిమ్రాన్ కి పేరు తీసుకొస్తుందో చూడాలి.