అమితాబ్ బాలీవుడ్ సూపర్ స్టార్.. చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ వీరిద్దరూ కలిసి తెరపై కనపడితే ఇక అభిమానుల సంతోషానికి హద్దు ఉంటుందా? వీరిద్దరి అపూర్వ కలయికను `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో ప్రేక్షకులు వీక్షించబోతున్నారు. మీరిద్దరూ మెగాస్టార్స్ కదా.. అమితాబ్తో కలిసి నటించడం ఎలా ఉంది? అని అడిగితే చిరంజీవి ఏమాత్రం తడుముకోకుండా ఇచ్చిన సమాధానంతో ముంబై మీడియా థ్రిల్ ఫీలైంది.“నాకు తెలిసి ఇండియాలో ఒకే ఒక మెగాస్టార్ అమితాబ్గారు మాత్రమే. ఆయన దగ్గరకు కూడా మేం వెళ్లలేం“ అన్నారు. అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనిపించనున్నారు.
previous post
next post