“పునాదిరాళ్లు” సినిమాతో తెలుగు సీనీ ఇండస్ట్రీకి పరిచయమై.. భారతీయ చిత్రపరిశ్రమలో చరిత్రను తిరగరాసిన నటుడు చిరంజీవి. తెలుగు భాషలోనే కాదు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి.. తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని మెగాస్టార్గా ఎదిగారు. వెండితెరపై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ..బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు.
తెలుగు సినీ పరిశ్రమను సరికొత్త పుంతలు తొక్కించిన నటుడు చిరంజీవి. ప్రత్యేకంగా ఆయన డ్యాన్స్, ఫైట్స్ తో యువతనే కాకుండా అన్ని రకాల వయస్సుల వారిని ఎంతగానో ఆలరిస్తున్నాడు. ఆ మధ్యకాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరు.. “ప్రజారాజ్యం” అనే పార్టీని స్థాపించి.. రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. తిరిగి మళ్లీ ఆయన సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల ఆయన నటించిన “సైరా” సినిమాతో తన సత్తాను చాటారు.
దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవితో నటించాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే ఆయన కుటుంబంలోని పలువురు ఆయనతో కలిసి నటించారు. ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. రామ్ చరణ్ సినిమా మగధీర సినిమాలో చిరు గెస్ట్ రోల్ పోషించారు. అలాగే, చిరు సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలో తండ్రితో కలిసి ఓ సాంగ్కు స్టెప్పులేశారు చరణ్. తాజాగా చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ నటిస్తున్నారు. అలాగే, ఆయన కుమారుడితో పాటు మేనల్లుడు అల్లు అర్జున్, తమ్ముళ్లు పవన్, నాగబాబు, బామ్మ ర్ది అల్లు అరవింద్లు కూడా చిరు సినిమాల్లో కలిసి నటించారు.
అయితే, చిరు జీవితంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన తండ్రి వెంకట్రావ్ గురించి. ఎందుకంటే.. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సినీ చరిత్రను తిరగరాసే నటుడిగా చిరు ఎదగడంలో ఆయన చాలా కృషి చేశారు. ఆయన తండ్రికి సినిమాలపై ఉన్న మక్కువతోనే చిరు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే చిరు, ఆయన తండ్రి వెంటకట్రావ్లు కలిసి ఓ సినిమాలో నటించారు. ఇది మీకు తెలియక పోవచ్చు.. కానీ ఇది నిజం. ఆ సినిమానే “మంత్రిగారి వియ్యంకుడు”. ఈ సినిమాలో మంత్రిగారి వేషం కోసం అల్లురామలింగయ్య.. వెంకట్రావ్ పేరును సూచించారట. అయితే, చిరు, ఆయన తండ్రి ఒకే ఫ్రేమ్లో కనిపించకపోయినప్పటికీ.. ఇద్దరు ఇకే సినిమాల్లో నటించడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఇదివరకూ పలుమార్లు చిరు వెల్లడించిన సంగతి తెలిసిందే.