Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసించి సింహాసనాన్ని అధిరోహించిన హీరో చిరంజీవి. ఇండస్ట్రీలో అందరికీ అత్యంత సన్నిహితంగా ఉండే..చిరంజీవి అక్కినేని ఫ్యామిలీ తో మరింత చనువుగా ఉంటారు అని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. ఇండస్ట్రీ లో ఎవరు ఎలా ఉన్నా కాని ఎక్కువగా మాత్రం కింగ్ నాగార్జున తో..చిరు చాలా స్నేహంగానే ఉంటారు. అదేవిధంగా నాగార్జున కూడా చిరంజీవితో అత్యంత సన్నిహితంగా ఉంటూ..వస్తుంటారు. ఇటీవల నాగార్జున నటించిన “వైల్డ్ డాగ్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కూడా చిరంజీవి.. పాల్గొనడం జరిగింది.
అంతే కాకుండా నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో లలో కూడా చిరంజీవి రెండు సార్లు అతిథిగా వచ్చి టైటిల్ అనౌన్స్ చేశారు. అంతలా ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్న నేపథ్యంలో.. మీరిద్దరూ కలిసి కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయినా సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినబడుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి మాధవన్ నటించిన “విక్రమ్ వేద” సినిమా తెలుగులో .. చిరంజీవి నాగార్జున రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ తెలుగు నెటివిటీకి నచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు.. ఫిలిం వర్గాల నుండి అందుతున్న టాక్. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది టాప్ హీరోలు.. కలసి మరి మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి తరంలో చూసుకుంటే మొదటిగా.. వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. మహేష్ బాబుతో చేసిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాతో .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు వెంకీ రిబ్బన్ కటింగ్ చేయగా.. చాలా మల్టీస్టారర్ సినిమాలు ప్రస్తుతం వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, పవన్ – రానా మల్టీస్టారర్.. ఇంకా చాలా సినిమాలు.. వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో.. చిరుతో కింగ్ నాగార్జున సినిమా చేస్తున్నట్లు వార్త రావడంతో.. ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.