Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం” ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో దాదాపు 40 నిమిషాల పాటు కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం తరువాత షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రీకరణలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
వీరిద్దరిపై జరిగే షూటింగ్ కోసం మెగాస్టార్ పై కొన్ని సన్నివేశాలను అడవులలో చిత్రీకరణలో భాగంగా చిత్రబృందం రాజమండ్రి దగ్గరలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలు పూజా హెగ్డే కోయ యువతి పాత్రలో చేయనున్నట్లు సమాచారం.
చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా పోషిస్తున్నారు. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాంతంలోనే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కోసం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే ఉన్నాడు. మొత్తానికి మెగా హీరోలు అందరూ షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉండటం ఆశక్తికరమైన విషయం అని చెప్పవచ్చు.