Bhola Shankar: శివరాత్రి సందర్భంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “బోలా శంకర్” సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో రిలీజ్ అయిన ఈ పోస్టర్ గ్లింప్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “ముఠామేస్త్రి”.. “ఘరానా మొగుడు” అన్న తరహాలో.. చిరంజీవి మాస్ లుక్ లో అదరగొట్టేసారు. జీప్ ఫ్రంట్ లో కూర్చుని తనదైన శైలిలో స్టిల్ కి ఫోజు ఇచ్చారు. తమిళంలో వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. చిరంజీవి సరసన హీరోయిన్ పాత్రలో తమన్నా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.
చాలా తక్కువ టైంలో ఈ సినిమాని కంప్లీట్ చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు సమాచారం. కరోనా తీసుకొచ్చిన గ్యాప్..కి బదులుగా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాలను తక్కువ టైంలో అందించాలని చిరంజీవి వరుసపెట్టి సినిమాలకు ఒప్పుకుంటున్నారు అట. కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు పెద్దగా పని లేక పోవడంతో… ఇప్పుడు సినిమాలు ఒప్పుకోవడం వల్ల వారందరికీ కూడా ఉపాధి కలుగుతుందని.. చిరంజీవి రీతిగా ఒకపక్క బోలా శంకర్ సినిమా చేస్తుండగానే మరోపక్క గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్ లు స్టార్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.
మరోపక్క ఇదే సమయంలో ఈ వేసవిలో ఏప్రిల్ మాసం లో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య విడుదల చేస్తున్నారు. మార్చి నెల చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో… ఆచార్య సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి కంటే ఎక్కువగా రామ్ చరణ్ పాల్గొనే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.