Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన “ఆచార్య” రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరోపక్క మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ చిరంజీవి స్టార్ట్ చేసేసారు. మలయాళంలో “లూసీఫర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చాలామంది సెలబ్రిటీలు నటిస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ పాత్ర చేయడం జరిగింది. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ముంబైలో షూట్ చేశారు.
చిరంజీవి.. సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమాలో స్టెప్పులు కూడా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు మొన్నటిదాకా వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ముంబైలో పూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సెకండ్ సినిమా స్టార్టింగ్ టైం లో.. మీడియా సమావేశం పెట్టిన టైంలో విజయ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. చిరంజీవితో పూరి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లు కామెంట్లు చేశాడు.
అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేశారు. నర్సీపట్నం నుండి ఒక కుర్రాడు.. వెండి తెరపై నా నటుడిగా వెలుగు వెలగాలని.. హైదరాబాద్ కి వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కలలా మిగిలిపోయా కూడదు అందుకే “గాడ్ ఫాదర్” లో ఓ స్పెషల్ రోల్.. పూరి చేస్తున్నట్లు చిరంజీవి కన్ఫర్మ్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. ఈ క్రమంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 786 చొక్కా ధరించి… పూరి జగన్నాథ్ తో షూటింగ్ లొకేషన్ లో దిగిన ఫోటో.. పోస్ట్ చేయడం జరిగింది.