Chiranjeevi: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటించిన “ఆచార్య” ఏప్రిల్ లో విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయింది. ఫస్ట్ టైం చిరంజీవి, చరణ్ కలసి ఫుల్ లెన్త్ సినిమా చేయటం రిజల్ట్ దారుణంగా రావడంతో ఆచార్య మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరిచింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకు చిరంజీవి.. తన భార్య సురేఖ తో కలిసి విదేశీ ట్రిప్ దాదాపు నెల రోజులు వేయడం తెలిసిందే. ఇటీవలే విదేశీ ట్రిప్ వెళ్ళిన తర్వాత తిరిగి హైదరాబాద్ కి చేరుకున్న చిరంజీవి ఇప్పుడు.. చేస్తున్న సినిమా షూటింగ్ లను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా మలయాళం “లూసిఫర్’ రీమేక్ సినిమా తెలుగులో “గాడ్ ఫాదర్” గా చేస్తున్న సంగతి తెలిసిందే.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకు కంప్లైంట్ కావడం జరిగింది. దీంతో ఫైనల్ టచ్ డబ్బింగ్ ఇవ్వడానికి చిరంజీవి ఇప్పుడు రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ప్రస్తుతం “గాడ్ ఫాదర్” కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిరంజీవి.. “గాడ్ ఫాదర్” కి డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమాని దసరా పండుగ నేపథ్యంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.