IFFI 2022: గోవాలో 53వ అంతర్జాతీయ చలనచిత్రం వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవటం జరిగింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి సమేతంగా చిరంజీవి రావడం జరిగింది. అవార్డు అందుకున్న అనంతరం వేదికపై చిరంజీవి చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు అని తెలియజేశారు.
ఇండస్ట్రీలో లైట్ బాయ్ మొదలుకొని ఇండస్ట్రీస్ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరీ భాగస్వామ్యం వలనే నేను మెగాస్టార్ అనే స్థాయికి చేరుకోవటం జరిగిందని తెలిపారు. ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గతంలో ఇటువంటి వేడుకలలో పాల్గొన్నా. ఆ సమయంలో దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోటోలు లేవని బాధపడ్డా. కానీ ఇప్పుడు ప్రాంతీయ వేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజులు వచ్చాయి అంటూ చిరంజీవి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేమికులందరికీ తాను దాసుడిని అని స్పష్టం చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా రంగంలో టాలెంట్ ఉంటే రాణించగలరు. లేదంటే లేదు అంతే అంటూ పేర్కొన్నారు.
45 సంవత్సరాల కు పైగా ఇండస్ట్రీలో ఉన్న. రాజకీయాల్లోకి వెళ్ళటం వలన. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమా వెలువ ఏంటో అర్థమైంది. అన్ని రంగాలలో అవినీతి ఉండొచ్చు కానీ చిత్ర పరిశ్రమలో అవినీతి లేదు. టాలెంట్ ఒక్కటే కొలమానం అని తెలియజేశారు. అంతేకాకుండా రాజకీయాల నుండి మళ్లీ సినిమా రంగంలో రియంట్రీ ఇచ్చిన సమయంలో చాలా ఆలోచించాను. ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా ఎలా అనేక అనుమానాలు.. ఉండేవి. కానీ రియంట్రీ ఇచ్చాక.. అంతకుముందు కంటే మరింతగా నాపై అభిమానం చూపించారు అంటూ చిరంజీవి చాలా ఎమోషనల్ స్పీచ్ గోవాలో అవార్డు అందుకున్న తర్వాత ఇవ్వటం జరిగింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!