ఈ ఏడాది తెలుగు సినిమా రంగంలో అతిపెద్ద భారీ ఫ్లాప్ సినిమా “ఆచార్య”. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ లేని ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ కొరటాల శివ “ఆచార్య” తో మొట్టమొదటి పరాజయాన్ని ఫేస్ చేయడం జరిగింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ లాంటి అతిపెద్ద స్టార్ హీరోలు.. తిరుగులేని డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో రావాల్సిన సినిమా.. “ఆచార్య” కాదు అని చూసిన జనాలు నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన “లాల్సింగ్ చద్దా” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తెలుగు దర్శకులు కొంతమంది హీరోలు సెట్స్ లోకి వచ్చాక డైలాగులు రాస్తున్నారు. దానివల్ల అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఏ హీరో ఇవ్వలేరు.. అని పేర్కొన్నారు. దీంతో చిరంజీవి ఈ వ్యాఖ్యలు పరోక్షంగా డైరెక్టర్ కొరటాల శివను ఉద్దేశించి చేసినవని సోషల్ మీడియాలో నేటిజెన్ లు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయాలనుండి చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక.. మొదట చేసిన సినిమా “ఖైదీ నెంబర్ 150”. అది రీమేక్ సినిమా. ఆ తర్వాత “సైరా”. “సైరా” కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు టైం కేటాయించారు. ఇక “ఆచార్య” విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్… పక్క ప్లానింగ్ తో కాకుండా.. అనేక బ్రేకులు పడటం జరిగింది.
ఒకపక్క రాంచరణ్ “RRR”.. చేస్తూ మరోపక్క.. ఈ సినిమా చేశారు. దీంతో ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కొరటాల హీరోలు సెట్స్ లోకి వచ్చాక డైలాగులు రాసినట్లు.. భావిస్తున్నారు. దీంతో పరోక్షంగా కొరటాల శివాని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటె “ఆచార్య” సినిమా పరాజయం పాలు కావటంతో… సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు.. కొరటాల కార్యాలయం వద్ద ఆందోళనలు నిరసనలు చేపట్టడం జరిగింది. దీంతో వాళ్లకి న్యాయం చేయడానికి కొరటాల.. తన ఆస్తులు అమ్ముకోవడానికి కూడా సిద్ధమైనట్టు ఇటీవల వార్తలు రావడం జరిగింది. ఏది ఏమైనా ‘లాల్సింగ్ చద్దా’ టీజర్ కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.