Chiranjeevi-Koratala: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. సోనూసూద్ విలన్ పాత్రను పోషించారు.
కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న అంటే మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర టీమ్ విసృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే `ఆర్ఆర్ఆర్` మాదిరిగా `ఆచార్య` టీమ్ని కూడా ఇండస్ట్రీలోని ఇతర దర్శకులు ఇంటర్వ్యూలు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందులో భాగంగా హరీష్ శంకర్ తాజాగా చిరు, చరణ్, కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఎంతో సరదాగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్.. ఆచార్య టీమ్ ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. చరణ్ కాకుండా బెస్ట్ డ్యాన్సర్లు ఎవరని అడగగా.. అందుకు చిరంజీవి `తారక్, అల్లు అర్జున్, రామ్, నితిన్` అని సమాధానం ఇచ్చారు.
అలాగే `చంటబ్బాయ్` రీమేక్లో ఎవరు నటిస్తే బాగుంటుందని ప్రశ్నంచగా.. బన్నీ అని చిరు సమాధానం ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే `మీరు ఒక్కసారి గా చరణ్ లా మారిపోతే చిరంజీవిగారిని ఏం అడుగుతారు?` అనే ప్రశ్నను కొరటాల శివనును హరీశ్ అడగాడు. అయితే కొరటాల సమాధానం చెప్పడానికి ముందే.. చిరు మైక్ అందుకుని `నా ఆస్తి పేపర్లు అడుగుతారు` అని చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!