ఒకప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేసిన బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఇప్పుడు సీనియర్ హీరోలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. వయసు మీద పడిన క్రమంలో మరోపక్క కుర్ర హీరోలు రాణించడంతోపాటు సినిమా రంగంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురు హీరోలు వినూత్నంగా కెరియర్ ముందుకు సాగనంపుతున్నారు. ఈ క్రమంలో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ప్రస్తుతం సినిమా ధియేటర్ ల కంటే ఓటిటి లకి డిమాండ్ ఎక్కువైపోయింది. దీంతో ఇప్పటికే బాలకృష్ణ “ఆహా” ఓటిటి ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాప్పబుల్” అనే టాకీ షోతో హోస్టింగ్ చేసి..హోస్ట్ పరంగా కూడా తనకి ఇప్పటికే తిరుగులేదని బాలయ్య నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు సెకండ్ సీజన్ మొదలుకానుంది.
మరోపక్క బాలయ్య కంటే ముందుగానే నాగర్జున.. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో చేయడం తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఈ షో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతూ వస్తుంది. త్వరలో మొదలు కాబోయే ఆరో సీజన్ కి కూడా నాగార్జున యే హోస్ట్. ఇక ఇదే సమయంలో నాగార్జున తన సినిమాలను కూడా ఓటీటి లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. చిరంజీవి కూడా ఇప్పుడు ఓటీటి లో రాణించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటి లో.. వినూత్నంగా వెబ్ సిరీస్ లు చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
తన ఇమేజ్ కి తగ్గ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తే కచ్చితంగా చేస్తానని ఇప్పటికే మాట ఇచ్చినట్లు టాక్. దీంతో చిరంజీవికు నచ్చే కంటెంట్ని ఏ ఓటీటీ సంస్థ అందిస్తుందో చూడాలి. ఇదే సమయంలో మరికొన్ని ప్రోగ్రాములు కూడా చేయడానికి… చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత ఓటిటి కంటెంట్ మరియు కార్యక్రమాలపై చిరంజీవి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!