ఆగస్టు 22వ తారీకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా చిరంజీవి బర్త్డే వేడుకలు ఎవరు సరిగ్గా జరపలేదు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో…మెగా ఫ్యాన్స్ ఈసారి చిరంజీవి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే తన పుట్టినరోజు నాడు మెగా ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ చిరంజీవి ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రీయంట్రీ తర్వాత చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150, సైరా రెండు సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకోవడం జరిగింది. కానీ ఏడాది ఆచార్యతో దారుణమైన డిజాస్టర్ తో అభిమానులను నిరోత్సాహపరిచారు. కాగా ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ మూడింటిలో రెండు రీమేక్ సినిమాలు. “గాడ్ ఫాదర్”, “బోలా శంకర్” రెండు కూడా రీమేక్ ప్రాజెక్ట్ లు. మరొకటి భారీ దర్శకత్వం తెరకేక్కుతున్న “వాల్తేరు వీరయ్య”. అయితే తన పుట్టినరోజు నాడు “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించడానికి చిరంజీవి రెడీ అయినట్లు సమాచారం.
మిగతా రెండు సినిమాలకు సంబంధించి వీడియో లేదా పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తన పుట్టినరోజు నాడు అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వడానికి చిరంజీవి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. “గాడ్ ఫాదర్” కి సంబంధించి కొద్ది రోజుల క్రితం విడుదలైన వీడియోలు దసరాకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. కానీ తేదీ ప్రకటించలేదు. అయితే చిరంజీవి బర్త్డే నాడు గాడ్ ఫాదర్ రిలీజ్ తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం.