Acharya: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య” ఏప్రిల్ 29వ తారీకు రిలీజ్ కావడం తెలిసిందే. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా టాక్ విషయంలో బయట నెగిటివ్ ప్రచారం భయంకరమైన జరుగుతూ ఉండటంతో చిరంజీవి మేనేజర్ గంగాధర్ సీరియస్ అయి వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ “ఆచార్య”.. ఫ్యామిలీ సినిమా అని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని తెలిపారు. చరణ్ చిరంజీవిని ఒకే ఫ్రేమ్ లో చూడాలన్నది సురేఖ అమ్మ గారి కోరికతో పాటు అభిమానుల కోరిక.. కావటంతో భగవంతుని దయవల్ల “ఆచార్య” రూపంలో అది కుదిరిందని తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్నీ కూడా వైలెన్స్ కథ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కానీ ఆచార్య పూర్తిగా కుటుంబ కథా చిత్రం అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో యాంటీ ఫ్యాన్స్ లేని హీరో చిరంజీవి కానీ ఆచార్య విషయంలో… కొంతమంది యాంటీ ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అవ్వకుండానే వ్యతిరేకంగా నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ అదంతా తప్పు. ట్రోల్లింగ్ చేసేవారు సినిమాని సినిమాలాగే చూడాలని చిరంజీవి మేనేజర్ మీడియా ముందు వార్నింగ్ ఇచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మనసు పెట్టి “ఆచార్య” చూస్తే మంచి సినిమా చూసినట్లు ఫీల్ కలుగుతుందని తెలిపారు. మనసులో ఒకటి పెట్టుకొని సినిమా చూస్తే మీకు ఏ సినిమా నచ్చదు ఇది వాస్తవం.. “ఆచార్య” పై నెగిటివ్ ప్రచారం చేయొద్దు అని ఇది కుటుంబ కథా చిత్రం అని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ చిరంజీవి మేనేజర్ గంగాధర్ మీడియా కి తెలియజేయడం జరిగింది. ఒకసారి చూస్తే సరిపోదు మొదటిసారి చిరంజీవి రెండోసారి చరణ్ నీ చూసే విధంగా సినిమా ఉందని అన్నారు.