సీనియర్ నటుడు, మాజీ ఎం.పి మురళీమోహన్ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. మే 14న తన తల్లి అస్థికలను గంగానదిలో కలపడానికి మురళీమోహన్ వారణాసి వెళ్లారు. అక్కడ ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అక్కడి నుండి హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్ష చేసిన వైద్యులు మైనర్ ఆపరేషన్ చేయాలన్నారు. ఈ ఆపరేషన్ మే 24న పూర్తయ్యింది. నిన్న(శుక్రవారం) మురళీమోహన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. విషయం తెలుసుకున్న చిరు, సురేఖ దంపతులు స్వయంగా మురళీమోహన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య విషయంపట్ల రాజమండ్రిలోని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని మురళీమోహన్ ఓ వీడియో కూడా విడుదల చేశారు. తాను త్వరలోనే రాజమండ్రి వచ్చి అందరినీ కలుస్తానని కూడా అన్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!