మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే. బిజినెస్ సర్కిల్స్ లో కూడా చిరంజీవి సినిమా ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంటుంది. సినిమాను కమర్షియల్ గా కొత్త పుంతలు తొక్కించారు చిరంజీవి. తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకున్నా కూడా ఆయన చరిష్మాలో ఎటువంటి మార్పు లేకపోవడం విశేషం. రీఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150, సైరా.. నరసింహారెడ్డి సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరి చిరంజీవి క్రేజ్ ను నిరూపించాయి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన లూసిఫర్, వేదాళం రీమేక్స్ చేయబోతున్నారు. వీటిపై ప్రస్తుతం ఆసక్తికరమైన న్యూస్ రౌండ్ అవుతోంది.
ఈ రెండు సినిమాల్లో లూసిఫర్ సినిమాను మొదట పట్టాలెక్కిస్తారని.. ఫిబ్రవరిలో ప్రారంభం కావొచ్చని సమాచారం. లూసిఫర్ ను తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. నిజానికి ఈ సినిమాకు సుజీత్, వినాయక్ పేర్లు వినిపించినా స్క్రిప్టులో వారు చేసిన మార్పులు చిరంజీవిని నచ్చలేదని తెలుస్తోంది. మోహన్ రాజాకు స్క్రిప్టు బాధ్యతలు అప్పజెప్పారని.. ఆయన చేసిన మార్పులు మెగాస్టార్ కు నచ్చిందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో ప్రారంభించేలా చిరంజీవి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఇదేనంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు రౌండ్ అవుతున్నాయి.
ప్రస్తుతానికి వైరల్ అవుతున్న ఈ వార్తపై ఇంకా అఫిషియల్ న్యూస్ రివీల్ కాలేదు. ఓవైపు మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాళం రీమేక్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోల్ కతాలో దసరాకు సంబంధించిన వేడుకలు చిత్రీకరించారనే గాసిప్ ఇటివల వైరల్ అయింది. ఈ నేపథ్యంలో లూసిఫర్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి చిరంజీవి ధ్యాస అంతా ఆచార్యపైనే ఉంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.