Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఇంద్ర సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బి. గోపాల్ దర్శకత్వంలో సి అశ్వని దత్ నిర్మించిన ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ సృష్ఠించింది. అయితే మళ్లీ ఇప్పుడు అలాంటి సీమ కథతో రాబోతున్నారని లేటెస్ట్ న్యూస్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సారి వచ్చే సీమ కథలో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఇంతక ముందెప్పుడూ లేని వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కొరటాల శివతో ఇప్పటికే చిరు ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. అలాగే, మలయాళంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ ‘లూసీఫర్’ సినిమాని తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో భారీ హిట్ చిత్రం ‘వేదాలం’ రీమేక్గా తెలుగులో చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్’ రూపొందుతోంది. ఇందులో కీర్తి సురేష్ చిరుకు సోదరిగా నటిస్తోంది. మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా హీరోయిన్.
Chiranjeevi: రాయలసీమ నేపథ్యంలో సినిమా కథ..!
అలాగే, బాబీ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదే క్రమంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమలతోనూ ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హై ఓల్టేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వెంకీ కుడుముల తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని చిరు పాత్ర చాలా పవర్ ఫుల్గా ఉంటుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట.