Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రీతిలో మెగాస్టార్ చిరంజీవి చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమా చేస్తూ ఉన్నారు. “గాడ్ ఫాదర్” వచ్చే దసరా పండుగకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య”… మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోళా శంకర్” సినిమా షూటింగ్ లు జరుపుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ ప్రాజెక్టుల తరువాత డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి చిరు రెడీ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలైనట్లు సమాచారం. గతంలో వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు చేయడం జరిగింది.
రెండు కూడా సూపర్ డూపర్ హిట్స్. పైగా వివి వినాయక్ చిరంజీవి అభిమాని కావడంతో ఇప్పుడు మూడో సినిమా చేయటానికి చిరంజీవి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వివి వినాయక్ స్టోరీ వినిపించినట్లు చిరంజీవి ఓకే చెప్పినట్లు వచ్చే ఏడాదిలో ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అంతమాత్రమే కాకుండా గతంలో మాదిరిగానే మూడో సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలోనే తీసే ఆలోచనలో వి.వి.వినాయక్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.