Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల ఓ కమర్షియల్ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న చిరంజీవి.. తాజాగా సదరు సంస్థ యాడ్లో నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, స్టార్ యాంకర్ అనసూయ కీలక పాత్రలను పోషించారు.
ఉగాది నాడు విడుదలైన ఈ యాడ్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఈ యాడ్పై ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పుడు ఈ యాడ్కు చిరు అందుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. శుభగృహ రియల్ ఎస్టేట్ యాడ్ కోసం చిరంజీవి ఏకంగా రూ. 7 కోట్లు పారితోషకం తీసుకున్నాడట.
ఏదమైనా ఒక నిమిషం ఉన్న యాడ్కి ఏడు కోట్లంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కాగా, చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. రామ్ చరణ్ ఇందులో కీలక పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేశారు.
అలాగే చిరు మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేశ్ డైరెక్షన్లో `భోళా శంకర్`, బాబీతో `మెగా 154` చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా చిరు చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.