చిరంజీవి.. తనకు వివాదాలతో పనిలేదు.. తన పనేదో తను చేసుకుంటూ పోతుంటాడు. అందుకే మెగాస్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగొందుతున్నాడు. చిరంజీవి కెమెరాల ముందు చాలా గంభీరంగా కనిపించినా బయట మాత్రం చాలా ఫన్నీగా కనిపిస్తుంటాడు. అయితే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి కామెడీ సెటైర్లతో అలరించాడు. కామెడీ స్పీచ్ తో అదరగొట్టే తనలో ఒక మంచి కమెడియన్ ఉన్నాడనేది నిరూపించారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 2008లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో తన గురించి మీడియా చూపించిన ప్రచారాన్ని గుర్తుచేసుకున్నారు. సదరు మీడియా సంస్థలకి తానంటే ప్రాణమని పదే పదే తన గురించి చూపించడానికి ఆసక్తి చూపుతారన్నారు.
ప్రజా అంకిత యాత్ర సమయంలో ముఖ్యంగా మూడు మీడియా సంస్థ తన వెంటే ఉండేవని తెలిపారు. తను అభిమానులు కలవడానికి వచ్చినప్పుడు వారితో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి బస్సులో వచ్చి కూర్చునేవాడిని.. ఆ తర్వాత శానిటైజర్ తో తన చేతులను శుభ్రం చేసుకునే వాడిని తెలిపారు. అదే తను చేసిన తప్పు అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఓ అభిమాని ప్రేమతో ఇచ్చిన ఖర్జూరాలను తినడానికి చేతులను శానిటరీ చేసుకుంటే దాన్ని మరో విధంగా చూపించారన్నారు. అభిమానులను చేతితో ముట్టకున్నందకు చేతులను శభ్రం చేసుకున్నట్లు వార్తలు ప్రచురించరన్నారు. ముందు వెనుక కట్ చేసి పదే పదే ఆ వీడియోను టెలికాస్ట్ చేశారని సెటైర్ వేశారు. ఈ షోలో ఉల్లాసంగా గడిపిన చిరంజీవి పలువురు యాంకర్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ అచార్య షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆచార్య షూటింగ్ సమయంలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కొద్దిరోజులు షూటింగ్కు విరామం ప్రకటించారు. తాజా టెస్ట్లో నెగిటివ్ రావడంతో త్వరలోనే షూట్ పాల్గోననున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!