GodFather: జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండకుండా తన వంతు కృషి చేస్తానని పవన్ తెలియజేశారు. ఇందుకోసం ఎవరితోనైనా కలవడానికి రెడీగా ఉన్నట్లు.. ఎన్నికలకు ముందు ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితి ఇలా ఉంటే జనసేన పార్టీలోకి చిరంజీవి రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి రాజకీయాల నుండి నేను తప్పుకున్నాను, రాజకీయం నా నుండి దూరం కాలేదు అని సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ పెట్టడం తెలిసిందే.
దీంతో చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రియంట్రి ఇస్తున్నట్లు తమ్ముడు పవన్ పార్టీ జనసేన లో జాయిన్ అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో “గాడ్ ఫాదర్” తాజా ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రేపే విడుదల కానున్న తరుణంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నట్లు ఏనాడు కూడా బహిరంగంగా గట్టిగా చెప్పలేదని తెలిపారు.
ఇదే సమయంలో భవిష్యత్తులో మద్దతు ఇస్తానో, లేదో తెలియదని అన్నారు. “నా తమ్ముడు నిబద్ధత, నిజాయితీ గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడా కూడా వాటిని వదలలేదు. నిజాయితీ గల నాయకుడు మనకి కావాలి. అలాంటివారు రావాలని నా ఆశ. నేనొక పక్కన, తాను ఒక పక్కన ఉండేకంటే.. నేను తప్పుకుని, సైలెంట్ అయిపోతేనే పవన్ బెస్ట్ నాయకుడు అవుతాడని అనుకుంటున్నాను అని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!