Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వయసు మీద పడుతున్న సినిమాలు ఒప్పుకోవడంలో.. కుర్ర హీరోలు కూడా చిరంజీవి స్పీడ్ అందుకోలేకపోతున్నారు. రాజకీయాలనుండి రియంట్రి ఇచ్చిన తర్వాత ప్రారంభంలో వివి వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో “ఖైదీ నెంబర్ 150”, ఆ తర్వాత సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో “సైరా నరసింహారెడ్డి” చేసిన చిరంజీవి రెండు సినిమాలతో మంచి విజయాలు అందుకోవటం జరిగింది. ఆ తర్వాత వెంటనే కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో “ఆచార్య”(Acharya) సినిమా స్టార్ట్ చేయగా షూటింగ్ 30% కంప్లీట్ కాక మహమ్మారి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో.. షూటింగ్ లు ఆగిపోవడం ఆ తర్వాత పరిణామాలు మారడం మొత్తానికి “ఆచార్య” ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ రాబోయే మూడు అతిపెద్ద పండుగలను టార్గెట్ చేసుకొని సినిమాలు విడుదల చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా “లూసిఫర్” తెలుగులో “గాడ్ ఫాదర్”(God Father) గా చేయడం తెలిసింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసి దసరా పండుగకు సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా నటిస్తున్నారు.
సల్మాన్ చేసేది అతి పెద్ద పాత్రని సమాచారం. ఇక ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న “బోలా శంకర్” ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ రెండవ తారీకు విడుదల చేయనున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా సంక్రాంతి పండుగకు కానుకగా రిలీజ్ చేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే తెలుగులో మూడు అతిపెద్ద మూడు భారీ పండుగలకు చిరంజీవి తన మూడు సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి… బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఒక సాంగ్ మినహా అది కూడా సల్మాన్ ఖాన్ తో చిరంజీవి స్టెప్ లు వేసే సాంగ్ మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!