Chiranjeevi : చిరు మూవీలో 20 నిమిషాల కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న టాప్ హీరోయిన్..!!
Chiranjeevi : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తిరుగులేని బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ కలిగిన కొరటాల ఆచార్య కోసం చాలా టైం కేటాయించడంతో పక్కా పర్ ఫెక్ట్ హిట్ గ్యారెంటీ అని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు బ్లాక్ బస్టర్ హీట్లు కొడుతున్న తరుణంలో ఆచార్య సినిమా కోసం ఏకంగా 20 నిమిషాలకి ఈ ముద్దుగుమ్మ కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిలిం వర్గాల లో టాక్ నడుస్తుంది.
ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ అవుతున్న తరుణంలో వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా గానీ “ఆచార్య” కోసం పూజ హెగ్డే కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు .. , ముఖ్యంగా చిరంజీవి మరియు రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్లు నటిస్తుండటంతో తనకి కూడా భారీగానే రెమ్యూనరేషనర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి కోటి రూపాయలు అడిగినట్లు దానికి చిత్రయూనిట్ కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల లో సరికొత్త వార్త వినబడుతోంది. ఇలాంటి తరుణంలో మరో 20 నిమిషాలు పూజా హెగ్డే పాత్ర సినిమాకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ముఖ్యంగా మెగా కాంపౌండ్ లో వరుణ్ తేజ్, బన్నీ వంటి హీరోలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఈ ముద్దుగుమ్మ గతంలో రామ్ చరణ్ తో “రంగస్థలం” సినిమా లో ఓ సాంగ్లో నటించడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ఏకంగా సినిమాలో చరణ్ పక్కన హీరోయిన్ గా రెడీ అవటంతో మెగా అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ముంబై భామ తో నటించిన మెగా హీరోల సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ కావడంతో “ఆచార్య” కి కూడా ఆ సెంటిమెంట్ కలసి వస్తుందని భావిస్తున్నారు.