టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరి నారాయణరావు పెద్దగా వ్యవహరించడం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి సమస్య విషయంలో దాసరి నారాయణరావు పెద్దగా వ్యవహరిస్తూ ఒకపక్క ప్రభుత్వాలతో మరోపక్క… ఇండస్ట్రీలో ప్రముఖమైన వారితో మాట్లాడుతూ చాలా సమస్యలు ఇట్టే పరిష్కరించే వాళ్ళు. ఆయన మరణించాక సినిమా ఇండస్ట్రీ పెద్ద విషయంలో చాలామంది పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇండస్ట్రీలో ఆపద వచ్చిందంటే ముందుగా ఎంతమంది పేర్లు వినబడిన.. మెగాస్టార్ చిరంజీవి అన్ని తానై వ్యవహరిస్తూ ఉన్నారు.
కరోనా లాంటి కష్ట కాలంలో సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందించడం మాత్రమే కాదు వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించడం జరిగింది. “CCC” అనే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా విరాళాలు సేకరించి సినిమా ఇండస్ట్రీ కార్మికుల కష్టాలను తీర్చి… అందరికీ ఆపద్బాంధవుడుగా నిలిచారు. ఇక ఇదే సమయంలో సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడటంలో సమస్య పరిష్కరించడంలో.. మొదటి నుండి చిరంజీవి కీలకంగా వ్యవహరించడం తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యల విషయంలో చిరంజీవి పెద్దగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో సినిమా కార్మికుల కోసం చిరంజీవి మరో బృహత్కారమైన కార్యం మొదలు పెట్టారు.
హైదరాబాద్ చిత్రపురి కాలనీలో పది పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి కొణిదల వెంకట్రావు పేరిట ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది పుట్టినరోజు లోగా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఇందులో సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణం విధుల కోసం తనవంతుగా మ్యూజికల్ ఈవెంట్ చేస్తానని తమన్ తెలిపారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!