GodFather: మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” విజయం సాధించటంతో వరుస పెట్టి సక్సెస్ మీట్ లలో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చేస్తున్న సినిమాలు గురించి ఇంకా అనేక విషయాలు గురించి తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా చిరంజీవి తగ్గి ఉండటం అభిమానులకు మరి కొంతమంది సన్నిహితులకు నచ్చటం లేదు ఈ విషయంపై మీరు ఏమంటారు అని చిరంజీవిని విలేకరి ప్రశ్నించడం జరిగింది. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో బ్లడ్ బ్యాంక్ భూముల విషయంలో నాపై అనేక ఆరోపణలు చేశారు.
ఆ సమయంలో చాలా సంయమనంతో ఉన్నాను. అందువల్లే నిజాలు నిలకడ మీద తెలిసాయి. బ్లడ్ బ్యాంక్ విషయంలో భూకబ్జాలు చేసినట్లు అనేకమంది ఆరోపణలు చేసినా కానీ నేను పెద్దగా స్పందించలేదు. ఈ రీతిగా ఉండటం వల్లే అప్పట్లో శత్రువుగా నన్ను భావించిన వాళ్ళు తర్వాత మిత్రులు అయ్యారు. ఇక పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్న సమయంలో తనని నివేదించిన ఓ ప్రముఖ వ్యక్తి ఇంటిపై దాడి జరిగిన సమయంలో నా తప్పు కాకపోయినా గానీ నేను సదరు వ్యక్తి ఇంటికి పొద్దున్నే వెళ్ళటం మీకందరికీ తెలుసు.
ఇదే సమయంలో తెలుగు ఇండస్ట్రీకి తాను కృతజ్ఞుడునని తెలిపారు. ఇంకా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ప్రేక్షకులు నన్ను ఏ రకంగా చూడాలని అనుకుంటున్నారో… అన్ని రకాలుగా ఆ సినిమాలో చూసుకోవచ్చు. “బోలా శంకర్”లో కూడా దర్శకుడు మెహర్ రమేష్ అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో.. అద్భుతంగా తెరెక్కిస్తున్నడు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు వింటున్న ఏదైనా ఓకే అయితే డిసెంబర్ లో ప్రకటన ఉంటుంది. మార్చి తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతాయి.. అంటూ కొత్త ప్రాజెక్ట్ లు గురుంచి చిరంజీవి స్పష్టం చేశారు.