‘లాల్సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెట్స్ లోకి వెళ్లాక వేడివేడి టిఫిన్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ డైలాగులు చెప్పాలి అనే దాని విషయంలో అప్పటికప్పుడు… తెలుగు దర్శకులు సెట్స్ లో రాసి ఇస్తున్నారు. ఈ విధానం కరెక్ట్ కాదు. షూటింగ్ సెట్లోనే డైలాగు రాసి అప్పటికప్పుడు ఆ డైలాగులు చెప్పాలంటే… నటుడికి చాలా కష్టం అనిపిస్తుంది. ముందుగానే డైలాగులు రాస్తే… సదరు నటుడు వాటిని అర్థం చేసుకుని.. అద్భుత రీతిలో స్క్రీన్ మీద ప్రజెంట్ చేయవచ్చు. కానీ అప్పుడే డైలాగులు రాయటం, వెంటనే ఆ పేపర్ తీసుకొచ్చి నటుడు చేతిలో పెట్టి చెప్పమనటం… నటుడిని తొందరపెట్టి డైలాగులు చెప్పించినట్లు ఉంటుంది.
తద్వారా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో చెప్పలేరు. దయచేసి తెలుగు దర్శకులు… ముందుగానే డైలాగులు రాసుకునీ నటుడుకి ఇస్తే మంచిదని చిరంజీవి ‘లాల్సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పేర్కొన్నారు. గొప్ప దర్శకులు రాజమౌళి ఇంకా చాలామంది దర్శకులు రాత్రింబగలు డైలాగులపై వర్క్ చేసి ముందుగానే నటులకు ఇస్తారని స్పష్టం చేశారు. ఇంకా అనేక విషయాల గురించి చిరంజీవి ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘లాల్సింగ్ చద్దా’ తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆగస్టు 11వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. కరీనాకపూర్ హీరోయిన్. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో అమీర్ ఖాన్ నటనపై చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ చలనచిత్ర రంగానికి అమీర్ ఖాన్ ఖజానా లాంటోడు అని చెప్పుకొచ్చారు. తెలుగులో ఈ సినిమా అందించడానికి తొందరపడి నిర్ణయం తీసుకోలేదని సినిమా చూసి గర్వపడి ‘లాల్సింగ్ చద్దా’ విడుదల చేస్తున్నట్లు చిరంజీవి స్పష్టం చేశారు.