Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ పరాజయం లేని డైరెక్టర్ గా తనకంటూ సెపరేట్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్న కొరటాల శివ.. “ఆచార్య” ఊహించని రేంజ్ లో తెరకెక్కించడం జరిగిందట. మధ్యలో కరోనా రావడం తో చాలా టైం కలిసి రావడంతో… ఆచార్య కి సంబంధించిన ప్రతి ఫ్రేమ్ హైలెట్ గా ఉండేలా.. శివ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అని టాక్. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమాలో.. చిరంజీవి పాత్ర చాలా హైలెట్ గా ఉంటుందని.. కానీ స్టోరీ మొత్తం చరణ్ కి సంబంధించినదని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఫస్ట్ టైం చరణ్ చిరంజీవి దాదాపు కొన్ని నిమిషాల పాటు ఏకధాటిగా.. చేస్తున్న సినిమా కావడంతో ఆచార్య పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలావుంటే ఇటీవల చరణ్ కి “ఆర్ఆర్ఆర్” రూపంలో భారీ బ్లాక్ బస్టర్ దక్కడం తెలిసిందే. దీంతో ఫుల్ జోష్లో ఉన్న రామ్ చరణ్ ఆచార్య కి ఒక పక్క హీరోగా చేస్తూనే నిర్మాతగా చేయటం తెలిసిందే. దీంతో ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించాలని చెర్రీ డిసైడ్ అయ్యారట. అయితే ఈ సినిమా లో చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా.. చరణ్ కి హీరోయిన్ గా పూజ హెగ్డే నటించడం జరిగింది. ఈ క్రమంలో ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాల్లో కాజల్ అగర్వాల్ కూడా పాల్గొనాలని డిసైడ్ అయ్యి చరణ్ తో మంతనాలు జరపడం జరిగిందట.
కానీ చరణ్ మరియు చిరంజీవి అస్సలు కుదరదు అని.. నువ్వు ఈ టైం లో రెస్ట్ తీసుకోవాలి అని సీరియస్ గా చెప్పారు అంట. మేటర్ లోకి వెళ్తే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నిండు గర్భిణీ ని పైగా మరికొద్ది నెలల్లో బిడ్డకు జన్మనివ్వడం ఉన్న తరుణంలో ఈ టైంలో అసలు.. ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని చరణ్ చిరంజీవి “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలకు కాజల్అగర్వాల్ నీ రావద్దని.. ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పటం జరిగిందట. మెగా ఫ్యామిలీ తో ముందు నుండి కాజల్ అగర్వాల్ కి మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ తో. మగధీర హిట్ అయిన తర్వాత. చరణ్ చాలా సినిమాలు కాజల్ అగర్వాల్ కి నిర్మాత గా ఉంటూ అనేక ఆఫర్లు ఇవ్వటం జరిగింది. సరిగ్గా లాక్డౌన్ సమయంలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోగా ప్రస్తుతం గర్భిణీగా కావడంతో.. ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాలకు కాజల్ అగర్వాల్ నీ వద్దని నిర్మాతగా చరణ్ చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్.