Surya: సూర్య సౌత్ ఇండియాలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది గజిని సినిమా వల్ల అని చాలామంది అంటుంటారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తమిళంలో అదే విధంగా తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగులో సూర్యా కి ఊహించని మార్కెట్ క్రియేట్ అయింది. హారిస్ జయరాజ్ అందించిన మ్యూజిక్ సూర్య నటించిన నటనకు.. ప్రేక్షకులు ఎంతగానో ఎంటర్టైన్ అయ్యారు. సూర్య బాడీ.. వొంటి పై పచ్చ టాటూలు.. అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేయడం జరిగింది. హిందీలో ఇదే సినిమాని మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నీ హీరోగా పెట్టి తీసి.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫస్ట్ 100 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టడం జరిగింది.
హిందీలో అనేక రికార్డులు సృష్టించింది. వాస్తవానికి ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ నీ హీరోగా పెట్టి చేయాలని అప్పట్లో అనుకోక మధ్యలోనే ఆ ప్రయత్నాలు ముగిసినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఈటీ’. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నారాయణ్దాస్ నారంగ్, డి. సురేష్బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మార్చి మూడవ తారీఖు కు హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఈటీ’ బిగ్ టికెట్ను విడుదల చేశారు.
ఇదే కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ సూర్య సార్ మీరు కచ్చితంగా గజిని సెకండ్ పార్ట్ తీయాలి అని కోరారు. అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ కచ్చితంగా రజిని రెండో భాగం వస్తే బాగుంటుందని.. జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జ్యోతిక మేడం చాలా అదృష్టవంతురాలు. మీ లాంటి భర్త ఆమెకు దొరకటం మామూలు విషయం కాదు అని అన్నారు. అదే సమయంలో వర్క్ చేస్తున్నా ప్రతిరోజు మీ ఇంటి నుండి నాకు క్యారేజ్ రావడం మీరు నా పట్ల చూపించిన ప్రేమ మర్చిపోలేను అంటూ జానీ మాస్టర్ ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.