2019 అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17లో లోక్సభ స్థానాలకు నేడే ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిశ్రమకు నిలమయమైన హైదరాబాద్లో సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిరంజీవి, రామ్చరణ్, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేశారు. అలాగే తారక్, బన్ని జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తల్లి షాలిని, భార్య లక్ష్మి ప్రణతి సహా తారక్ జూబ్లీ హిల్స్ పోలింగ్ బూతుకు వచ్చి ఓటేశారు. అందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. `మాకు ఇంక్ పడింది.. మరి మీకు పడిందా?` అని అడుగుతూ తారక్ తన ఇన్స్టాలో ఓ ఫోటోను కూడా జత చేశారు.