Aacharya: సినీ అదేవిధంగా పొలిటికల్ రంగంలో ఇప్పుడు ఓ వార్త ట్రెండింగ్ గా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఒకే వేదిక పై ఏపీ సీఎం జగన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు సరికొత్త వార్త వినిపిస్తోంది. పూర్తి విషయంలోకి వెళ్తే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ చరణ్ కూడా నటించడంతో… మెగా ఫ్యాన్స్ “ఆచార్య” కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో.. “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్ 23 వ తారీకు నిర్వహించాలని నిర్మాతగా చరణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా ఈ వేడుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సిద్ధార్థ కాలేజ్ ప్రాంగణంలో జరగనుందట.ఈ సందర్భంగా “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా జగన్ నీ చిరంజీవి ఆహ్వానించినట్లు.. జగన్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ టికెట్ ధరల విషయంలో… ఏపీ ప్రభుత్వం పాజిటివ్ గా రియాక్ట్ కావటంతో… “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకలో సీఎం జగన్ ని ఇండస్ట్రీ తరఫున చిరంజీవి సన్మానం చేయనున్నట్లు టాక్. ఇక ఇదే సమయంలో ఈ వేదికపై నుండి ఇండస్ట్రీకి సంబంధించి సీఎం జగన్ పలు వ్యాఖ్యలు కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా టికెట్ ధర విషయంలో ఏపీ సీఎం జగన్.. చాలా వరకు చిరంజీవి చెప్పిన సూచనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి అప్పట్లో సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో తెలిపారు. ఇటువంటి తరుణంలో “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా సీఎం జగన్ వ్యవహరించడంతో సన్మానం చేయాలని చిరంజీవి డిసైడ్ అయ్యి.. వైయస్ జగన్ ని ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో నిర్మాతగా ఉన్న చరణ్.. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వానం పంపినట్లు.. కుదిరితే.. పవన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సరికొత్త వార్త అటు రాజకీయ రంగంలో ఇటు ఇండస్ట్రీలో వినపడుతోంది. అన్నీ కుదిరి పవన్ ఈ వేడుకకు హాజరైతే మాత్రం … ఫస్ట్ టైం పవన్ అదే విధంగా జగన్ ఎదురు పడినట్లు అవుతోంది. అంతమాత్రమే కాదు “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక అన్ని అనుకున్నట్లు జరిగితే.. జగన్, పవన్, చిరు ఒకే వేదికపై.. కనిపిస్తే ఏపీ పొలిటికల్ ముఖచిత్రం కూడా మారే అవకాశం ఉన్నట్టు.. తాజా వార్త పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ టికెట్ ధరల విషయంలో సీఎం జగన్ చాలా పాజిటివ్ గా నిర్ణయాలు తీసుకోవడంతో “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా.. సినిమా యూనిట్ ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కూడా వచ్చే అవకాశమున్నట్లు ఇండస్ట్రీ టాక్.
previous post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!