Radhey Shyam: “బాహుబలి”తో తన క్రేజ్ మాత్రమే కాదు టోటల్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్ ప్రభాస్ ఓ రేంజ్ లో పెంచేసిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో “బాహుబలి” అనేక రికార్డులు సృష్టించింది. కొద్దిపాటి బడ్జెట్ తో రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో “బాహుబలి” తెరకెక్కించడం.. తో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశంలోనే కాదు ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ ఇటీవల తెలుగు సినిమా రంగం చాలా అభివృద్ధి చెందింది అని… దేశానికి ప్రపంచానికి గర్వకారణంగా మారిందని పొగడటం తెలిసిందే.
ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన… ప్రభాస్ తో చాలామంది వివిధ ఇండస్ట్రీలకు చెందిన టాప్ నిర్మాతలు దర్శకులు సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభాస్ క్రేజ్ నార్త్ మొదలుకొని సౌత్ వరకు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ప్రభాస్ తాజా సినిమా “రాధేశ్యాం” మార్చి 11 వ తారీకు రిలీజ్ కానున్న క్రమంలో.. సినిమా ప్రమోషన్ విషయంలో సరికొత్త ఐడియాతో రెడీ అయ్యారు.
మేటర్ లోకి వెళ్తే దేశవ్యాప్తంగా.. నడిచే మెట్రో ట్రైన్స్… లోకల్ ట్రైన్స్ కి రాధేశ్యాం పోస్టర్లు అంటించడానికి రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా ముందుగా దేశ రాజధాని న్యూఢిల్లీలో మెట్రో రైల్ లోకల్ ట్రైన్స్ కి పోస్టర్లు అతికించడం ప్రమోషన్లు తనదైన శైలిలో పబ్లిక్ లో బాగా సినిమా వెళ్లేలా.. వ్యవహరిస్తున్నారు. పాతకాలం నాటి ప్రేమకథా నేపథ్యంలో ప్రభాస్ నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. గోపికృష్ణ అదేవిధంగా యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా రాధేశ్యాం నిర్మించడం జరిగింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సినిమా వస్తూ ఉండటంతో.. అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.