నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “BB3”. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ రోర్ అన్న పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెసాన్స్ వచ్చింది. ఈ టీజర్ తో బాలయ్య బోయపాటి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న టాక్ నడుస్తోంది. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ “BB3″మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య నటించే సినిమాల గురించి, దర్శకుల గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రీమేక్ సినిమా చేస్తున్నారన్న వార్త కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అయితే వాటన్నిటికి బాలయ్య ఇచ్చిన క్లారిటి అదిరిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియుమ్ సినిమా తెలుగు రీమేక్ లో బాలయ్య నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో .. అటువంటిదేమీ లేదని తేల్చి చెపారు బాలయ్య.
అయ్యప్పన్ కోషియుమ్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ భారీ మొత్తంతో రైట్స్ ను దక్కించుకున్నారు. ఇందులోనే బాలయ్య నటిస్తాడని మరో హీరోగా రానా చేస్తాడన్న న్యూస్ వచ్చింది. అయితే ఈ సినిమాతో పాటు ఆదిత్య 369 సీక్వెల్ వస్తుందని అలాగే బాలయ్య తో ఇంతకముందు పైసా వసూల్ తీసిన పూరి తో ఒక సినిమా చేస్తారని అన్నారు. కాని ఇవన్ని బాలయ్య కాదని ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమా తప్ప మరేది ఒప్పుకోలేదని క్లారిటి ఇచ్చారు.