Prabhas: పాపం ప్రభాస్ ఫ్యాన్స్..వరుస బ్యాడ్ న్యూస్లు వినిపిస్తున్నాయి. ఆయన సినిమా వచ్చి రెండేళ్ళకు పైగానే అయింది. బాహుబలి తర్వాత గ్యాప్ తీసుకోనన్న ప్రభాస్ సాహోతో గ్యాప్ తీసుకొని ఫ్యాన్స్కు ఇచ్చిన మాట తప్పాడు. అందుకు కారణం సాహో హాలీవుడ్ రేంజ్ సినిమా కావడంతో పాటు ఎక్కువశాతం వీఎఫెక్స్ వర్క్ ఉండటం. సాహో సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూశారో అందరికీ తెల్సిందే. అలాంటి సినిమా ఒక్క హిందీలో తప్ప మిగతా భాషలలో ఫ్లాప్ మూటగట్టుకుంది.
ఆ తర్వాత నుంచి ప్రభాస్ గ్యాప్ లేకుండా నా సినిమాలను మీ ముందుకు తీసుకువస్తానని ప్రామిస్ చేశాడు. కానీ, అనుకున్న సమయానికి రాధే శ్యామ్ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయాడు. కారణాలు చాలానే ఉన్నాయి. పీరియాడికల్ రొమాంటిక్ సినిమా. వింటేజ్ లవ్ స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ ఉన్న ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఈ బ్యాడ్ న్యూస్తో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు.
prabhas: ప్రభాస్ సినిమాను మిస్ చేయకుండా చూసే ప్రతీ ప్రేక్షకుడికీ నిరాశే.
ఇప్పుడు మరో పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చింది. రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఇప్పట్లో ఏ సినిమా షూటింగ్లో పాల్గొనే ఆసక్తితో ప్రభాస్ లేరట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది ఒక్క రాధే శ్యామ్ సినిమా మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదు వస్తాయనుకున్న సలార్, ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలు 2023లోనే రిలీజ్ చేస్తారని కొత్తగా టాక్ మొదలైంది. అందుకు కారణం ఈ థర్డ్ వేవ్ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే సెట్స్లోకి
అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే అభిమానులకు మాత్రమే కాదు ప్రభాస్ సినిమాను మిస్ చేయకుండా చూసే ప్రతీ ప్రేక్షకుడికీ నిరాశే.