Indian Cinema: ఇండియన్ సినిమా Indian Cinema దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. మహారాష్ట్ర పరిస్థితులు దేశాన్ని వణికిస్తున్నాయి. రోజుకి అక్కడ 25వేల కేసులు నమోదువుతున్నాయి. గత ఏడాది కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చాక ఇది ఊహించని షాకే. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వినోదం.. ఇలా అన్ని రంగాలు కూడా గాడిలో పడుతున్నాయి. ఇందులో వినోదం కూడా ఉంది. సినిమా షూటింగ్స్ జరగడమే కాదు.. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఫుల్ సీటింగ్ కెపాసిటీతో ధియేటర్లు, మల్టీప్లెక్సులు నడుస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ వార్తలు మళ్లీ కలవరానికి గురి చేస్తున్నాయి.
దేశంలోనే పెద్ద పరిశ్రమలైన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు శాండల్ వుడ్, మల్లూవుడ్ లో సినిమాలు విడుదయ్యాయి. అయితే.. టాలీవుడ్ సాధించిన సక్సెస్ మరెవరికీ దక్కలేదు. రెండు నెలల్లో రెండు సినిమాలు చెరో వంద కోట్లు వసూళ్లు సాధించాయి. మూడో నెలలో జాతిరత్నాలు ఇప్పటికే 50కోట్ల మార్కెట్ సాధించి కరోనా తర్వాత వరుసగా మూడో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతటి సక్సెస్ లో ఉన్న టాలీవుడ్ కు ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కాస్త కలవరపెడుతోంది. మళ్లీ ధియేటర్ల సమస్య వస్తుందేమో అనే అందోళన ఉంది. అయితే.. మహారాష్ట్ర వంటి తీవ్రమైన పరిస్థితులు ఏపీలో లేదు. తెలంగాణలో పరిస్థితి కొద్దిపాటి తీవ్రంగానే ఉన్నా అదుపులోనే ఉంది. ఏప్రిల్ లో వైల్డ్ డాగ్, వకీల్ సాబ్ వంటి పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ లో కొద్దిపాటి కంగారు ఉంది.
ఇప్పటికైతే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దంటూ జగ్రత్తలు చెప్తున్నాయి. ఇక్కడ ఇలా ఉ:టే కోలీవుడ్ లో కోవిడ్ నేపథ్యంలో స్కూళ్లకు సెలువులు ఇచ్చేశారు. ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు పెద్దగా సినిమాలూ లేవు. ఇక బాలీవుడ్లో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కంగారు పడుతోంది. సల్మాన్.. రాధే, అక్షయ్.. సూర్యవంశీ వంటి సినిమాలు వాయిదా పడతాయని అంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం బాలీవుడ్ కి మళ్లీ కష్టం వచ్చినట్టే. మరి ఏం చేస్తారో చూడాల్సందే…!
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!