KajalAggarwal: తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు అని చెప్పవచ్చు.”లక్ష్మీ కళ్యాణం” సినిమా ద్వారా ఎంతో అమాయకంగా నటించిన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. గత ఏడాది కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసినదే.పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ చందమామ.
పెళ్లి తర్వాత తాను ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ , మంచు విష్ణు “మోసగాళ్లు” చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.కాజల్ అగర్వాల్ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో అప్పుడప్పుడు కాజల్ అగర్వాల్ ముచ్చటిస్తూ ఉంటారు.
అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయిస్తా:
సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ కు నెటిజన్ల నుంచి ఓ ప్రశ్న ఎదురయింది. ఒకవేళ వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్న ఓ నెటిజన్ అడగడంతో,అందుకు కాజల్ అగర్వాల్ ఒక నిమిషం కూడా ఆలోచించకుండా మన దేశంలో అందరినీ ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తా అంటూ సమాధానం చెప్పారు.కాజల్ అగర్వాల్ ఈ విధంగా సమాధానం చెప్పడంతో ఈమె మనస్తత్వానికి నెటిజన్లు ఫిదా అవడమే కాకుండా, ఈమె పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక సినిమాల విషయానికొస్తే కాజల్ అగర్వాల్ నటించిన మోసగాళ్లు చిత్రం మార్చి 19న విడుదల కానుంది.అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మంచు విష్ణు అక్క పాత్రలో పోషించడం గమనార్హం.