తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 3 స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే `బిగ్బాస్ 3` ప్రారంభానికి ముందే పలు వివాదాలకు కేంద్రబిందువైంది. ముఖ్యంగా శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తాలు బిగ్బాస్లో కౌస్టింగ్ కౌచ్ ఉందంటూ రాయదుర్గం, బంజారా హిల్స్ పోలీస్ట్ స్టేషన్స్లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. ఈ ఆరోపణలు అవాస్తవమంటూ బిగ్ బాస్ నిర్వాహకులు క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చేయాలని, అప్పటి వరకు నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే బిగ్ నిర్వాహకులు ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. నేడు కోర్టు బిగ్బాస్ నిర్వాహకులకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!