Mahesh-Trivikram: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. మే 12న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది.
ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట` అనంతరం మహేశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇందులో మహేశ్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`ఎస్ఎమ్బీ 28` అనే వర్కింగ్ టైటిల్తో ఫిబ్రవరిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తర్వలోనే రెగ్యులర్ షూటింగ్ ను సైతం షురూ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మే 31న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.
అయితే ఆ రోజున `ఎస్ఎమ్బీ 28` సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిపై మేకర్స్ మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. మహేశ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.