Dasara: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా పర్వం కొనసాగుతోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అందరూ పాన్ ఇండియా సబ్జెక్టులే చేస్తున్నారు. అయితే ఈ తరహాలో ఒక కొత్త దర్శకుడుతో నాచురల్ స్టార్ నాని దసరా అనే సినిమా చేసి ఊహించని విజయం తాజాగా అందుకోవటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పూర్తి విషయంలోకి వెళ్తే శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు తో నాని నటించిన “దసరా” పాన్ ఇండియా నేపథ్యంలో ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయం పట్ల ప్రభాస్, మహేష్ బాబు, ఎస్.ఎస్ రాజమౌళి ఇంకా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు.
నార్త్ మొదలుకొని సౌత్ వరకు కలెక్షన్ లతో దూసుకుపోతూ ఉంది. సినిమా రిలీజ్ అయ్యి వారం కాకముందే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినట్లు కలెక్షన్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో “దసరా” సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఇలా ఉంటే ఏప్రిల్ 5వ తారీఖు బుధవారం కరీంనగర్ లో దసరా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. జీవితంలో చాలామంది కలలు కంటారు. ఆ కలలో నెరవేర్చుకునే ప్రయత్నంలో కొంతమంది నిరుత్సాహపరుస్తారు. ఒకప్పుడు 8 మంది ప్రోత్సహిస్తే ఇద్దరు నిరుత్సాహపరిచే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు ప్రోత్సహిస్తుంటే 8 మంది నిరుత్సాహపరిచే పరిస్థితికి దిగజారిపోయింది.
కనుక కలలు నెరవేర్చుకునే విషయంలో నిరుత్సాహపరిచే వ్యక్తులను వారి మాటలను పట్టించుకోవద్దు. కన్న కల కోసం 100% పోరాడండి ప్రాణాలు తెగించేటట్టు రాణించండి ఆటోమేటిక్ గా మీ కలలు నిజమవుతాయి. సినిమా రిలీజ్ అవుతుందంటే సోషల్ మీడియాలో చాలామంది ఇది పోతుంది అంటూ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవారు ఏకువైపోయారు. నెగెటివిటీపై ఈ దసరా సినిమా గెలిచింది. దసరా అంటేనే చెడుపై మంచి గెలవటం. ఇంతటి గెలుపు మీ అందరి వల్లే వచ్చింది అంటూ ప్రేక్షకులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నాని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. కరీంనగర్ లో దసరా విజయోత్సవ వేడుకలలో నాని స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!