Sarkaru Vaari Paata: `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే12న విడుదల కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్కు ముహూర్తం ఖరారు చేశారు. మే2న ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ మేరకు చిత్ర టీమ్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. మూవీ థీమ్ కు తగ్గట్టుగానే పక్కా మాస్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ను కట్ చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో మే 2న ట్రైలర్ బయటకు వస్తే మహేష్ ఫ్యాన్స్కు పూనకాలు ఖాయమని అంటున్నారు. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఇందులో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడనే టాక్ ఉంది. అలాగే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్రఖని కీలక పాత్రలను పోషించగా.. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక రిలీజ్కు కొద్ది రోజులే సమయం ఉండటంతో.. ఈ సినిమాకు సంబంధించి యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.