Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే. గత కొన్ని సంవత్సరాల నుండి వరుసపెట్టి సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ హీరోయిన్ గా చేతి నిండా సినిమాలతో విజయవంతమైన కెరీర్ కొనసాగిస్తోంది. నటనలో డిఫరెంట్ మాడ్యులేషన్ తో… వైవిద్యమైన క్యారెక్టర్లు చేస్తూ… డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సినిమా ప్రేమికులలో క్రియేట్ చేసుకుంది. ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకునే కూతురిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాతో ..స్టార్టింగ్ లోనే మరింత క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది.
ప్రజెంట్ చాలా ప్రాజెక్టులు చేస్తున్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. ఇండియన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ పాత్ర చేస్తోంది. కెరియర్ పరంగా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే దీపికాపదుకునే సోషల్ మీడియాలో…. యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో.. తన చిన్నతనంలో ఏడో తరగతి లో జరిగిన విషయాన్ని స్టోరీ రూపంలో బయట పెట్టింది. ‘నేను తొలిసారి, అలాగే చివరిసారిగా రాసిన కవిత. అప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నాను.
నాకు 12 ఏళ్లు. మా టీచర్లు మమ్మల్ని రెండు పదాలతో (ఐ యామ్) ఏదైనా కవిత రాయమన్నారు. నేను అవే పదాలతో టైటిల్ పెట్టి కవిత రాశాను. అలా కవిత రాయడం మళ్లీ ఎప్పుడూ జరగలేదు.’ అంటూ ఫస్ట్ టైం తాను కవిత రాసిన సందర్భం గురించి సోషల్ మీడియాలో దీపికా పదుకొనే తెలియజేసింది. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్తో ‘పఠాన్’ సినిమాలో నటిస్తోంది. దీపికా పదుకొణె-షారుఖ్ ఖాన్ జంటగా నటించడం ఇది నాలుగోసారి. ఇప్పటివరకు ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలలో వీరు కలిసి నటించారు. ఈ నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. షారుక్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ పరాజయాలలో ఉన్నాడు… దీంతో దీపికా పదుకొణే నటిస్తున్న పటాన్ సినిమాపై.. సెంటిమెంట్ పరంగా షారుక్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.