Deepika Padukone: ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ పెస్టివల్స్ జరుగుతున్నాయి. దాంతో వివిధ దేశాలకు చెందిన తారలతో పాటుగా మన దేశానికి చెందినటువంటి పలు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి తారలు హాజరవుతున్నారు. కాగా ఇది మూడవ రోజు. కేన్స్ సినిమా ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. దీనికి పలు తారలు ఉదాహరణలుగా నిలుస్తున్నారు. ఇపుడు తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే రెడ్ కార్పెట్ పై ఓ రెడ్ డ్రెస్ లో తళుక్కుమంది. డిజైనర్ దుస్తుల్లో దీపిక తనదైన మార్క్ వాక్ తో అలరించింది. దీనికోసం ఎరుపు రంగు గౌనుని ఎంపిక చేసుకుంది. పెప్లమ్ టాప్, ప్లెర్డ్ స్కర్ట్ తో కూడిన నెక్ లైన్ తో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేన్స్ ఫిల్మ్ పెస్టివల్స్ విశేషాలు:
రెండవ రోజు అంటే, నిన్న ఐశ్వర్య రాయ్ బచ్చన్, పూజాహెగ్డే, తమన్నా కూడా రెడ్ కార్పెట్ పై మెరిసి, మైమరపించిన విషయం తెలిసినదే. కాగా ఈ పెస్టివల్స్ లో దీపికకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యులలో ఒకరిగా భారతదేశం తరపున ఈమె ప్రాతినిధ్యం వహిస్తోంది. వేడుక ఆహ్వానిత దేశాల్లో భారతదేశం మొదటి ‘గౌరవ దేశం’గా ఆమె ఎంపిక కావడం విశేషం. అయితే నేటితో మూడవ రోజు. దాంతో పలు దేశాలకు చెందిన అందమైన ముద్దుగుమ్మలు ముద్దుముద్దు నడకలతో రెడ్ కార్పెట్స్ ని అందంగా మల్చుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వైరల్ అవుతున్న దీపిక మాటలు:
కాగా ఈనేపథ్యంలో దీపిక గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. దీపిక ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ”కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ని త్వరలో ఏదో ఒకరోజు భరత్ లో నిర్వహిస్తాం. మాకు ఆ ప్రతిభ ఉంది. కేన్స్ స్థాయిని అందుకేనే దిగ్గజాలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ అన్నింటికంటే ముఖ్యం నమ్మకం. అది భారత్ కి కావాల్సినంత వుంది!” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈ మాటలు మరలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే, రెడ్ కార్పెట్ పై దీపిక స్టైలిష్ వాక్ చూపరులను మంత్రం ముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.