ఢిల్లీలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్గా ప్రముఖ నటి దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన దీపిక కొత్త లుక్ విడుదలైంది. యాసిడ్ దాడి తర్వాత లక్ష్మీ అగర్వాల్ ఉన్న దీపిక లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాదిజనవరి 10న విడుదల చేయబోతున్నారు. విక్రాంత్ మాసే దీపిక సరసన నటిస్తున్నాడు. ఈ చిత్రంతో దీపిక పదుకొనె నిర్మాతగా కూడా మారారు. రణవీర్ సింగ్తో పెళ్లి తర్వాత దీపిక పదుకొనె నటిస్తున్న సినిమా ఇదే. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, దీపికా పదుకొనె కెఎ ఎంటర్టైన్మెంట్, మేఘనా గుల్జార్ మ్రిగా ఫిలింస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.
previous post
next post