Devatha Serial: రాధ హాస్పటల్ నుంచి దేవిని తీసుకొని ఇంటికి వస్తుంది.. చిన్మయి దేవి ఇంటికి రాగానే ఏడుస్తుంది. నేను నీ పక్కన ఉండి ఉంటే ఈ దెబ్బతగిలినిచ్చి ఉండేదాన్ని కాదు అంటూ.. దేవి, చిన్మయి ల అక్క చెల్లెల అనుబంధం ఇంట్లో అందరినీ కదిలిస్తుంది.. అక్క చెల్లెలు అంటే వీరిలా ఉండాలి అనేలా ఉంటుంది వీరి బంధం.. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇలా ఉన్నాయి..!
మాధవ్ ని చూస్తూ ఏంటి సారు ఎక్కడున్నారు అని రాధ ప్రశ్నిస్తుంది రాధా నిన్ను ఒక విషయం అడగాలి.. రాత్రి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు.. బయటకు వెళ్తే చెప్పకుండా వెళ్ళావు కదా.. చెబుదాం అనుకున్నాను మీరు కనిపించలేదు.. మరి బయట ఎక్కడ ఉన్నా నీకు దేవికి దెబ్బ తగిలిన విషయం ఎలా తెలిసింది..!? ఎవరైనా ఫోన్ చేయడానికి నీ దగ్గర ఫోన్ కూడా లేదు కదా.. రాత్రి గుడిలో సహస్ర అభిషేకం చేస్తున్నారంటే వెళ్లాను.. అక్కడినుంచి తిరిగి వస్తుంటే దేవమ్మ కనిపించింది. ఇంతలో దేవి కి దెబ్బతగిలింది. దేవికి దెబ్బతగిలి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆఫీసర్ వచ్చి దావఖానకు తీసుకుపోయారు. ఏంటి సార్ ఏమైంది అట్లా అడుగుతున్నారు అని రాధా ప్రశ్నిస్తుంది.. ఏం లేదు రాధ.. నేను పిల్లల్ని ఎంతలా ఆదిత్య దగ్గరకు వెళ్ళద్దు అని చెబుతున్న వాళ్ళు వెళుతున్నారు. వాళ్ళు వెళ్లకుండా చూసే బాధ్యత నీదే నని మాధవ్ చెప్తాడు..
ఇక రాధ దేవిని ఆదిత్య దగ్గరకు వెళ్లకుండా చేయడానికి దేవితో మాట్లాడకుండా ఉంటుంది. దేవి నాతో అమ్మ ఎందుకు మాట్లాడటం లేదు అని అడుగుతుంది.. నీకు నాకన్నా ఆఫీసర్ సార్ ఎక్కువ కదా.. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు కదా అని అంటుంది. రాధా ఆఫీసర్ సార్ తో మాట్లాడనని దేవి దగ్గర తన మీద ఓటు వేయమని ఒట్టు తీసుకుంటుంది.