Devatha Serial: మాధవ్ ఫోన్ లో లాయర్ గారు అలా ఎలా ఊరుకుంటాను.. నా జాగాలో ఎవరైనా రాయి పాతితే నేనెందుకు ఊరుకుంటాను.. మీరు కోర్టులో కేసు వేయండి. అవసరమైతే నాన్నగారితో మినిస్టర్ కి ఫోన్ చేసి నేను మాట్లాడతాను అని అంటూ ఉండగా.. రాధా వచ్చి రాయి పాతనివ్వండి సార్ ఇప్పుడు ఏమైంది అని అంటుంది.. మీరు చేస్తున్న దాని గురించి మీరు ఆలోచించరు కానీ.. మీ జాగాలో ఎవరైనా రాయి పాతితే తప్పా అని రాధ అంటుంది..!
మీరు మాత్రం ఇంకొకరికి సొంతమైన మనిషిని నాకు కావాలి అని అనుకుంటున్నారు.. రాయి అయితే ఎప్పటికైనా తీసి పక్కకు పడేయవచ్చు. మీరు ఇచ్చే నోటీసు పేపర్ కు ఉండే కొద్ది చెదలు పట్టి పాడైపోతుంది. అదే నా మెడలో ఉన్న మంగళసూత్రం రోజురోజుకి బలంగా తయారవుతుంది. నా పెనిమిటికి ఆపద వస్తే అడ్డంగా నిలబడి ప్రాణం పోస్తుంది అని రాధా అంటుండగా దేవి అక్కడికి వస్తుంది. రా బిడ్డా మనం ఇద్దరం బయటికి పోయి వద్దాం అని దేవిని తీసుకుని భాగ్యమ్మ దగ్గరకు తీసుకువెళ్తుంది.
దేవి భాగ్యమ్మను చూడగానే ఈ అబ్బా దేవుడమ్మ కాడ ఉంటది కదా అని అంటుంది. అప్పుడు నువ్వు నా మనవరాలు అని నాకు తెలియదు బిడ్డ అని మనసులో అనుకుంటుంది. ఇక భాగ్యమ్మ తో కలిసి దేవి ఆటలు ఆడుకుంటుంది. రాధను కూడా ఆట ఆడమని భాగ్యమ్మ పిలవడంతో ముగ్గురూ కలిసి ఆట ఆడుకుంటారు. ఇక టైం అవుతుందని దేవి అనడంతో రాధా కూడా వాళ్ళమ్మ దగ్గరి నుంచి ఇంటికి బయలుదేరుతుంది.