Devatha Serial: మాధవ్ దగ్గరకు వచ్చి రమ్య బావ రాధా ఎందుకు ఆది తెలుగు కలవడానికి వచ్చిందో అని అడిగావా అని అడుగుతుంది. లేదు రమ్య వస్తే ఏమైంది.. అలా అడగడం పద్ధతి కాదు.. అదేంటి బావా అలా అంటావు ఇంట్లో మీరందరూ ఉండగా మిమ్మల్ని కాదని ఆదిత్య దగ్గరకు వచ్చే అంత పెద్ద ప్రాబ్లం ఏముందని అని మాధవ్ ను రమ్య రెచ్చగొడుతుంది..!
అలా కాదు రాధను అలా అడగడం పద్ధతి కాదు.. పైగా అలా అడిగితే నన్ను తప్పుగా అనుకుంటుంది అని మాధవ్ మాధవ్ రమ్యతో చెబుతుండగా.. ఎదురుగా రాధ కనిపిస్తుంది. దాంతో ఇద్దరు సైలెంట్ గా ఉండి పోతారు. అవును నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్లాను దేవి నీ కలవద్దని మాట్లాడడానికి వెళ్ళాను. మాధవ తో మీరు చెప్పుడు మాటలు వినకండి. అసలు ఏం జరిగిందో అది తెలుసుకోండి అని రమ్య ను చూస్తూ తనకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాధవ్ తో మాట్లాడుతుంది.
శివరాత్రి కావటంతో ఆదిత్య తలకు నలుగు పెట్టమని వాళ్ళమ్మ షాంపూ డబ్బా ఇస్తే.. సత్య షాంపూ పారబోసి ఆదిత్యకు ఇష్టం లేని కుంకుడుకాయ రసం అందులో పోస్తుంది.. ఆదిత్య ఇది కుంకుడుకాయ రసంలాగా ఉంది అంటే.. ఇది ఒక కొత్తరకం షాంపు అని చెబుతోంది సత్య. కుంకుడుకాయ రసం గుర్తుపట్టిన ఆదిత్య అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతాడు ఇలా సత్య ఆదిత్య ను అడ్డుకొని తల స్నానం చేయించడానికి ప్రయత్నిస్తుంది అంతలో సబ్బు మీద కాలు వేసి జారిపడి పోతుండగా ఆదిత్య పట్టుకుంటాడు. సత్య ఆదిత్య తో డ్యూయెట్ వేసుకుంటండగా.. ఆదిత్య సత్య ఆట పట్టిస్తూ అక్కడినుంచి సైలెంట్ గా ఎస్కేప్ అవుతాడు. దేవి వాళ్ళ అమ్మ ఉపవాసం ఉంటుందని తెలుసుకుని తను కూడా ఉపవాసం ఉంటాను అంటుంది. ఇంతకీ దేవి ఉపవాసం ఎందుకు ఉండాలి అనుకుంటుందో.. తరువాయి భాగంలో తెలుసుకుందాం.