Devatha Serial: దేవి భోజనం చేయకుండా డైనింగ్ టేబుల్ దగ్గర దిగాలుగా కూర్చుంటుంది.. అది గమనించిన వాళ్ల తాతయ్య ఏమైందమ్మా బంగారం.. భోజనం చేయకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు.. వాళ్ల నాన్న కూడా దేవి ఏంటి భోజనం చేయడం లేదు.. ఏం జరిగిందో నాకు చెప్పు అని అడుగుతాడు.. స్కూల్ లో మా ఫ్రెండ్ ని దత్తత ఇస్తున్నారు దాని గురించి ఆలోచిస్తున్నా అని అంటుంది..!
దత్తత అంటే అమ్మా నాన్నలను వదిలి పెట్టి వేరే వాళ్ల దగ్గరికి వెళ్లి అమ్మాయి ఎలా సంతోషంగా ఉంటుంది ఆ చిన్న బిడ్డ మనసు చాలా బాధపడుతుంది కదా అని అంటుంది.. వాళ్ళు ఆ పిల్లను ఎలా చూసుకుంటారో ఏమో అని అంటుంది.. ఆ మాటలకు రాధ ఇదే సరైనా సమయం ఇప్పుడే నా మనసులోని మాటను చెప్పేయలి అని అనుకుని.. పిల్లలు లేని వారికి ఉన్న వాళ్ల దగ్గర పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. బిడ్డలు లేని వారికి పిల్లల విలువ బాగా తెలుస్తుంది. అందుకని ఆ పిల్లల్ని వాళ్ళు ఘనంగా చేసుకుంటారు. వాళ్ళు అడిగినవన్నీ తీసుకువచ్చి ఇస్తారు అని చెప్పిద్ది రాధ.. అన్నీ అయితే తీసుకు వచ్చి ఇస్తారు కానీ.. అమ్మను అమ్మ ప్రేమను మాత్రం తీసుకొచ్చి ఇవ్వలేరు కదా అని దేవి అంటుంది..
చిన్నదానివి అయినా సరిగ్గా చెప్పావు దేవి అని అంటుంది వాళ్ళ అవ్వ.. అవునమ్మా రాదా బిడ్డలను అమ్మ ప్రేమకు దూరం చేయకూడదు. అది చాలా పాపం. పిల్లలు నాన్న లేకపోయినా ఉండగలరు కానీ.. అమ్మ లేకుండా అమ్మ ప్రేమను పొందలేకుండా బ్రతకడం చాలా కష్టం. అలాంటి అమ్మ ప్రేమను పిల్లలకు ఎప్పటికి దూరం చేయకూడదు అని అంటుంది. అంతలో వాళ్ల తాతయ్య దేవితో నేను ఆ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న తో మాట్లాడుతా.. ఆ పిల్లను పంపించకుండా చేస్తాను బంగారం నువ్వు భోజనం చెయ్ అని చెబుతాడు. దేవి నిజంగా మాట్లాడతావా అని భోజనం చేస్తుంది. రాధ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఇక రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.