Devatha Serial: రాముర్తి పంచాయితీకి బయలు దేరుతుండగా ఊరు పెద్దలు వస్తారు.. ఇంటి వరకు వచ్చారంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది ఏంటి సంగతి అని అడుగుతాడు.. ఊర్లో పెళ్లి కానీ అమ్మాయిల అందరికీ పెళ్లి సంబంధాలు చూసాము.. అయితే అందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్నింటికీ అయ్యే ఖర్చును నేనే భరిస్తానని రామ్మూర్తి చెబుతారు.. అయితే ఈసారి వారి పెళ్ళిళ్లు మీ కొడుకు, కోడలు చేతుల మీదుగానే చేయించాలి అనుకుంటున్నాము.. అందుకే మిమ్మల్ని అడగడానికి ఇక్కడికి వచ్చామని పంచాయితీ పెద్దలు చెప్పగా.. రాముర్తి సరే అని అంటాడు..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
ఇక అదే విషయాన్ని రాధా మాధవ్ లను పిలిపించి చెబుతాడు. రాధా అందుకు ససేమిరా ఒప్పుకోనని చెబుతుంది. మాధవ్ కూడా రాధ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా తను ఇలాంటి వాటికి రాదని మీకు తెలుసు కదా నాన్న ఎందుకు మాట ఇచ్చారు అని అంటాడు. ఊరిలో పెద్దలందరూ ప్రతిసారి నన్ను అడుగుతున్నారు. ఎప్పుడు ఎదో ఒకటి చెప్పి మాట దటవేస్తున్నాను. ఈ సారి మాత్రం మీరు రాకపోతే నా పరువు పోతుంది అంటాడు రాముర్తి. మన పరువు కోసం రాధను బలవంతం చేయకూడదు కదా అంటాడు మాధవ్..
ఇక రేపటి ఎపిసోడ్ లో మాధవ్ కి సంబందించిన చుట్టాలు ఎవరో ఇంటికి వస్తారు. ఇక పిల్లల విషయంలో ఏదో మాట వచ్చి ఆ మాటల మీద మాధవ్ నేను చెబుతున్నాను కదా తనే తల్లి.. దయచేసి వాళ్ళ మనసులో ఇంకొక తల్లి ఉందన్న ఆలోచన రానివ్వకండి అంటాడు.. ఆ మాటలను దేవి చాటుగా వింటుంది. ఆ మాటను మనసులో ఉంచుకున్న దేవి.. మాధవ్ పిల్లల్లో తీసుకుని బయటకు వెళ్తుండగా అమ్మ నువ్వు కూడా అని అడుగుతారు.. నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది రాధ. ఎప్పుడు బయటకి వెళ్దాం అన్నా ఎప్పుడు ఏదో ఒకటి చెెప్తావు. అసలు నువ్వు మా అమ్మావేనా అని దేవి ప్రశ్నిస్తుంది.