Devatha Serial: మాధవ్ వాళ్ళింట్లో అందరూ భోజనానికి కూర్చున్నారు.. దేవి, చిన్మయి ఇంకా రాలేదని మాధవ్ కోపంతో భోజనం చేయకుండా అక్కడనుంచి వెళ్ళిపోతాడు. కనీసం పాలైన తాగమని రాధా మాధవ్ దగ్గరికి వెళుతుంది. దేవి నా నుంచి దూరం అవుతుందన్న ఆలోచనే నాకు ముద్ద దిగానివ్వటం లేదు.. అదే దేవి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్న నిజం తెలిస్తే.. రేపటి నుంచి మా అమ్మనాన్న కూడా నాకు తోడుఅవుతారు.. ఇక చిన్మయి పస్తులు ఉంటుంది. నువ్వే ఈ విషయంలో నీ నిర్ణయం మార్చుకో రాధ అని మాధవ్ చెబుతాడు…!
ఆదిత్య పిల్లలు తీసుకు వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. దేవి కలెక్టర్ గా మారిందని ఆఫీసర్ సారు దేవికి బంట్రోతు గా మారిన విషయం చిన్మయి వాళ్ళమ్మకు చెబుతుంది.. ఆఫీసర్ సారు నిన్ను అంత ప్రాణంగా చూసుకుంటున్నాడో చూసావా.. నీకోసం ఆయనే నీకు ప్యూన్ గా మారాడు అంటే నీ మీద ఆయనకు ఎంత ప్రేమో చూసావా.. అటువంటి ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా ఈ అమ్మను వదిలి అని అంటుంది.
నిన్ను వదిలిపెట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్లను. నన్ను నీ కన్నా బాగా ఎవరు చూసుకోలేరు. అమ్మ లేని చోట నేను ఉండను. ఆఫీసర్ సార్ వాళ్ల ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా అక్కడ మా అమ్మ ఉండదుగా.. నేను ఆ ఇంటికి వెళ్ళను అని దేవి చెబుతుంది. ఇక రాధ ఎలా దేవిని ఒప్పిస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.